జలగల చెరువులో ఆక్రమణలపై ఆరా!
ABN, First Publish Date - 2020-10-08T09:05:53+05:30
పట్టణం లోని జలగల చెరువులో ఆక్రమణలపై తహసీల్దార్ ప్రవల్లికప్రియ తదితరులు పరిశీలించారు.
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
నరసన్నపేట, అక్టోబరు 7: పట్టణం లోని జలగల చెరువులో ఆక్రమణలపై బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘‘జలగల్లా’ చేరిపోయారు’ శీర్షికతో వచ్చిన కథనంపై కలెక్టర్ నివాస్ స్పందించారు. ఆయన ఆదేశాలతో తహసీల్దార్ ప్రవల్లికప్రియ తదితరులు ఆ ఆక్రమణలను పరిశీలించారు. ఆక్ర మణలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, ఆక్రమణ దారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదే శించారు. చెరువు గట్టును 20 అడుగుల మేర చదును చేసి నట్లుగుర్తించి ఆక్రమణదారుడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వీఆర్వో చక్రవర్తిని తహసీల్దార్ ఆదేశించారు. జలగల చెరువులో అక్రమ నిర్మాణాలను పరిశీలించి మా ర్కింగ్ చేపడతామని సర్వే అధికారులు తెలిపారు.
Updated Date - 2020-10-08T09:05:53+05:30 IST