ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు

ABN, First Publish Date - 2020-11-27T05:12:43+05:30

ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్‌ జె.ని వాస్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం ఇప్పిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదవడం మాకిష్టం అనే కార్యక్రమాన్ని కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  కలెక్టర్‌ నివాస్‌  

 ‘చదవడం మాకిష్టం’ ప్రారంభం 

గుజరాతీపేట: ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్‌ జె.ని వాస్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం ఇప్పిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదవడం మాకిష్టం అనే కార్యక్రమాన్ని కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని పవేశపెట్టినట్లు చెప్పారు. చిన్నచిన్న వ్యాఖ్యల నుంచి గ్రంథాల వరకు అనర్గళంగా చదివేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నా రు. కథలు, పత్రికలు, ప్రముఖుల జీవిత చరిత్రలు, వైజ్ఞానిక విశేషాలతో పాటు అన్ని రంగాలకు చెందిన పుస్తకాలను గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, సమగ్ర శిక్షా అభియాన్‌ అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ పైడి వెంకటరమణ పాల్గొన్నారు. 


నాడు-నేడు పనుల పరిశీలన..

శ్రీకాకుళం రూరల్‌ మండలం ఇప్పిలి, ఖాజీపేట, కిల్లిపాలెం పాఠశా లల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను కలెక్టర్‌ నివాస్‌ గురువారం పరిశీలించారు.  పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, మరుగుదొడ్లకు రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఇప్పిలి సచివాలయాన్ని సందర్శించారు. పథకాలు లబ్ధిదారులకు చేరాలని సిబ్బందికి సూచించారు.


Updated Date - 2020-11-27T05:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising