రైతు భరోసా కేంద్రాలపై అవగాహన ఉండాలి
ABN, First Publish Date - 2020-02-23T07:33:21+05:30
రైతుభరోసా కేంద్రాలపై అవగాహన ఉండాలని వ్యవసాయ సంయుక్త సంచాలకుడు శ్రీధర్ పేర్కొన్నారు.
గుజరాతీపేట, ఫిబ్రవరి 22 : రైతుభరోసా కేంద్రాలపై అవగాహన ఉండాలని వ్యవసాయ సంయుక్త సంచాలకుడు శ్రీధర్ పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలపై అనుబంధశాఖల అధికారులకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హార్టీకల్చర్, పశుసంవర్ధక, మత్స్యశాఖ ద్వారా అమలు చేసే కార్యక్రమాలు కూడా రైతు భరోసా కేంద్రం పరిధిలోకి వస్తాయని చెప్పారు. కేంద్రాల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, పర్యవేక్షణాధికారి వరప్రసాద్, ఆత్మ ప్రాజెక్టు డైరక్టర్ బీజీవీ ప్రసాద్, మార్కెటింగ్, సెరికల్చర్, మార్క్ఫెడ్, ఏపీసీడ్స్, ఆగ్రోస్ సంస్థల జిల్లా స్థాయి అఽధికారులు, జిల్లాలోని వ్యవసాయ సహాయ సంచాలకులు, అభ్యుదయ రైతుకోత మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-02-23T07:33:21+05:30 IST