దుర్గమ్మ అన్నదాన పథకానికి రూ.5 లక్షల విరాళం
ABN, First Publish Date - 2020-12-05T05:53:28+05:30
దుర్గమ్మ అన్నదాన పథకానికి రూ.5 లక్షల విరాళం
విజయవాడ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అన్నదాన పథకానికి విశాఖ జిల్లా గాజువాక మండలం తుంగలం గ్రామానికి చెందిన కాకి గోవిందరెడ్డి శుక్రవారం రూ.5లక్షలు విరాళంగా అందజేశారు. కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రికి వచ్చిన ఆయన కాకి లీలాధర్రెడ్డి పేరు మీద దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్బాబుకు ఈ మొత్తాన్ని ఇచ్చారు. దాత కుటుంబ సభ్యులకు అమ్మవారి దర్శనం చేయించి శేషవస్త్రం, చిత్రపటం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. అలాగే, విజయవాడ అశోక్నగర్కు చెందిన లింగంగుంట శ్రీనివాస్ రూ.1,01,116 డీడీ రూపంలో అందజేశారు.
Updated Date - 2020-12-05T05:53:28+05:30 IST