ముస్లింలపై సీఎంది ద్వంద్వ వైఖరి
ABN, First Publish Date - 2020-11-14T05:19:35+05:30
ముస్లింలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వంద్వ వైఖరి అవ లంభిస్తోన్నారని టీడీపీ శ్రీకాకుళం పార్ల మెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు.
వేధింపులు, దౌర్జన్యాలు, అరాచకాలు ఎక్కువయ్యాయి
కూన రవికుమార్
గుజరాతీపేట: ముస్లింలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వంద్వ వైఖరి అవ లంభిస్తోన్నారని టీడీపీ శ్రీకాకుళం పార్ల మెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు.కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం కుటుం బం ఆత్మహత్యకు నిరసనగా ఏడురోడ్ల కూడలిలో శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్ర మంలో రవికుమార్ పాల్గొని మాట్లాడారు. జగన్ పాలనలో ముస్లింలు, దళితులపై వేధింపులు, దౌర్జన్యాలు, అరాచకాలు ఎక్కువయ్యాయన్నారు. ప్రజలకు రక్షణ, భద్రత లేదన్నారు. మైనార్టీలుగా పుట్టడమే ముస్లింల చేసిన పాపమా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు ఎం.వెంకటేష్, చిట్టి నాగభూషణం, ఎన్వీ రమణ, ముస్లిం నాయకులు సాతు, రెహమాన్, నిజాంద్ధీన్, బాషా, షఫీ, అన్వర్ పాల్గొన్నారు.
Updated Date - 2020-11-14T05:19:35+05:30 IST