మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి
ABN, First Publish Date - 2020-07-06T10:21:41+05:30
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు..
టెక్కలి, జూలై 5: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి అన్నారు. ఆదివారం టెక్కలిలో 108 వాహన సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా మెరుగైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్రం ముందువరసలో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ 1,088 అంబులెన్స్లను ఆధునిక సౌకర్యాలతో ప్రజ లకు అందజేశారన్నారు. గత ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో అవినీతికి పాల్పడితే జగన్ ప్రభుత్వం నీతివం తమైన పాలన అందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు డాక్టర్ కిల్లి రామ్మోహనరావు, టీబీజీ గుప్త, ధవళ కృష్ణ, బొడ్డేపల్లి శ్రీనివాస్, బమ్మిడి లక్ష్మీపతి, 108 సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2020-07-06T10:21:41+05:30 IST