వారం రోజులు మోదీ జన్మదిన వేడుకలు: సోము వీర్రాజు
ABN, First Publish Date - 2020-09-14T17:45:52+05:30
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఏడు రోజుల పాటు సేవాసప్తాహం కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ
విజయవాడ: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఏడు రోజుల పాటు సేవాసప్తాహం కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం నాడు విజయవాడలోని పాత ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీలకు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ నేతలు.. రియల్ గవర్నెన్స్ అనేది మోదీ చేసి చూపిస్తున్నారని అన్నారు. సంక్షేమంతో పాటు మంచి పాలన అందేలా బీజేపీ ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు.
Updated Date - 2020-09-14T17:45:52+05:30 IST