ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు

ABN, First Publish Date - 2020-07-28T08:10:03+05:30

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం

జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉత్తర్వులు

కన్నాను తప్పిస్తూ అనూహ్య నిర్ణయం 

మాధవ్‌, విష్ణు పేర్లు వినపడినా

చివరకు వీర్రాజుకే అవకాశం


అమరావతి/న్యూఢిల్లీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కన్నా లక్ష్మీనారాయణను అనూహ్యంగా పక్కకు తప్పించారు. కన్నాను మరో విడత పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిస్తారని... లేదా ఎమ్మెల్సీ పీవీ మాధవ్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తారని తొలుత బలంగా ప్రచారం జరిగింది. కానీ, వీర్రాజుకే బీజేపీ అధిష్ఠానం పట్టం కట్టింది. తూర్పు గోదావరి జిల్లా కాపు సామాజిక వర్గానికి చెందిన వీర్రాజు ఎమ్మెల్సీ కాలపరిమితి ఇంకో ఏడాదితో ముగియనుంది. 2018లోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కన్నాతో వీర్రాజు పోటీ పడ్డారు. చివరి నిమిషంలో అఽధిష్ఠానం వీర్రాజుకు ఎన్నికల కమిటీ బాధ్యతలు అప్పగించి, రాష్ట్ర అఽధ్యక్ష పదవిలో కన్నాను నియమించింది. ఇప్పుడు కన్నాను తప్పించి, అదే సామాజిక వర్గానికి చెందిన వీర్రాజును నియమించారు.


సంఘ్‌ ఆలోచన మేరకే..!

మొదటి నుంచీ పార్టీకి విధేయంగా ఉన్నవారినే బీజేపీ కీలక స్థానాల్లో నియమించాలన్నది సంఘ్‌ పరివార్‌ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పుడు వీర్రాజుకు అదే ప్లస్‌ పాయింట్‌ అయిందని అంటున్నారు. కన్నాను తప్పిస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ మాధవ్‌, రాయలసీమకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి పేర్లు వినిపించాయి. అయితే సామాజిక కారణాలతోపాటు, పార్టీలో అత్యంత సీనియర్‌ నాయకుడిగా ఉన్న సోమునే పదవి వరించినట్లు చెబుతున్నారు. మరోవైపు...  వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గత కొద్ది కాలం నుంచి  కన్నాపై  అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనాయకత్వంతో విజయసాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం... కన్నా తొలగింపుతో నిజమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - 2020-07-28T08:10:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising