ప్రైవేట్ స్కూళ్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి: సోము వీర్రాజు
ABN, First Publish Date - 2020-12-15T23:34:10+05:30
ఎం జగన్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ప్రైవేట్ స్కూళ్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని తెలిపారు.
అమరావతి: సీఎం జగన్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ప్రైవేట్ స్కూళ్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని తెలిపారు. కరోనా వల్ల ప్రైవేటు స్కూళ్లు మూతపడే పరిస్థితి ఉందని చెప్పారు. జీవోలు జారీ చేసి ప్రైవేట్ స్కూళ్లను అణిచివేస్తున్నారని సోమువీర్రాజు అన్నారు. జగన్ నియంతృత్వ విధానాలతో రాష్ట్రం అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు.
Updated Date - 2020-12-15T23:34:10+05:30 IST