శ్రీశైలం ఆలయ క్యూలైన్లలో పాము కలకలం
ABN, First Publish Date - 2020-06-29T21:47:06+05:30
కర్నూలు: శ్రీశైలం ఆలయం క్యూలైన్లలో ఓ పాము కలకలం రేపింది. దీంతో దేవస్థానం అధికారులు పది నిమిషాల పాటు దర్శనాలను నిలిపివేశారు.
కర్నూలు: శ్రీశైలం ఆలయం క్యూలైన్లలో ఓ పాము కలకలం రేపింది. దీంతో దేవస్థానం అధికారులు పది నిమిషాల పాటు దర్శనాలను నిలిపివేశారు. దేవస్థానానికి చెందిన స్నేక్ క్యాచర్ రాజా పామును పట్టుకుని అడవిలో వదలడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. శివుడికి ఇష్టమైన సోమవారం రోజు నాగుపాము ఆలయంలో ప్రత్యక్షమైందంటూ భక్తులు శివభక్తిలో లీనమైపోయారు. పామును గమనించిన దేవస్థానం సిబ్బంది.. స్థానిక స్నేక్ క్యాచర్ సాయంతో దాన్ని పట్టుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో వదిలేశారు.
Updated Date - 2020-06-29T21:47:06+05:30 IST