అన్ని పార్టీ నేతలతో మీటింగ్ నిర్వహిస్తాం: శివారెడ్డి
ABN, First Publish Date - 2020-07-02T16:50:13+05:30
విజయవాడ: అమరావతి ఉద్యమం 200 రోజుకి చేరుకుంటున్న తరుణంలో జేఏసీ సభ్యులు, అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు
విజయవాడ: అమరావతి ఉద్యమం 200 రోజుకి చేరుకుంటున్న తరుణంలో జేఏసీ సభ్యులు, అమరావతి పరిరక్షణ కమిటీ సభ్యులు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ... జులై 4కి అమరావతి ఉద్యమం చేపట్టి 200 రోజులు అవుతుందన్నారు. జులై 4 న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కోవిడ్ నిబంధనలు అనుసరించి అందరం ఇంట్లోనే ఉండి నిరసన తెలియజేస్తామన్నారు.
అన్ని పార్టీల నేతలతో 11 గంటలకు జూమ్ యాప్లో మీటింగ్ నిర్వహిస్తామన్నారు. అమరావతి ఉద్యమంలో 68 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని.. వారికి నివాళులు ఆర్పిస్తామన్నారు. విశాఖ వాసులు కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న భూములు అమ్ముతున్నారని.. సచివాలయాన్ని, హైకోర్ట్ను అమ్మరు అనే గ్యారెంటీ ఉందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శివారెడ్డి డిమాండ్ చేశారు.
Updated Date - 2020-07-02T16:50:13+05:30 IST