ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీపై హీరో సూర్య తండ్రి శివకుమార్‌ సంచలన ఆరోపణలు

ABN, First Publish Date - 2020-06-06T23:45:56+05:30

టీటీడీపై హీరో సూర్య తండ్రి శివకుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో డబ్బులున్నవారికే దర్శనాలు కల్పిస్తారని, గెస్ట్‌హౌస్‌లు ఇస్తారని మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీటీడీపై హీరో సూర్య తండ్రి శివకుమార్‌ సోషల్ మీడియాలో సంచలన ఆరోపణలు చేశారు. తిరుమలలో డబ్బులున్నవారికే దర్శనాలు కల్పిస్తారని, గెస్ట్‌హౌస్‌లు ఇస్తారని మండిపడ్డారు. సామాన్యులకు దర్శనం కల్పించకుండా తోసేస్తారని శివకుమార్‌ వాపోయారు. అలాంటి ఆలయంలోకి ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. టీటీడీపై దుష్ప్రచారం చేశారంటూ 8మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో హీరో సూర్య తండ్రి శివకుమార్‌ ఉన్నారు. తిరుమలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, తిరుమలకు వెళ్లొద్దంటూ శివకుమార్‌ అసత్య ప్రచారం చేశారని, తమిళ మయ్యన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.

సోషల్ మీడియాలో టీటీడీపై దుష్పచారం చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేయడాన్ని సుబ్బారెడ్డి తీవ్రంగా పరిగణించారు. టీటీడీ తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని చెబుతున్నారు. శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్న వారిపై టీటీడీ విజిలెన్స్ దృష్టి పెట్టింది. 

Updated Date - 2020-06-06T23:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising