బీజేపీ తన తప్పులను కరోనాపై నెట్టేస్తోంది: శైలజానాథ్
ABN, First Publish Date - 2020-06-06T17:36:27+05:30
బీజేపీ తన తప్పులను కరోనాపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. కరోనా రాకముందే దేశ అభివృద్ధి
విజయవాడ: బీజేపీ తన తప్పులను కరోనాపై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. కరోనా రాకముందే దేశ అభివృద్ధి చాలా దెబ్బతిందని గుర్తుచేశారు. దేశ ఆర్థిక రంగాన్ని మోదీ ఘోరంగా దెబ్బతీశారని ఆరోపించారు. రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ పేరుతో కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారని విమర్శించారు. బీజేపీ సంపద సృష్టిదారులతో లేదు, సంపద కలిగినవారితో ఉందని చెప్పారు. గుజరాత్, ముంబైలో కరోనా ఉధృతికి నమస్తే ట్రంపే కారణం కాదా? అని శైలజానాథ్ ప్రశ్నించారు.
Updated Date - 2020-06-06T17:36:27+05:30 IST