హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు: పట్టాభి
ABN, First Publish Date - 2020-05-26T01:31:38+05:30
వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలలో అన్యమత ప్రచారం పెరిగిందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. మాన్సస్ ట్రస్ట్ని ఎలా కబ్జా చేశారో చూశామన్నారు. టీటీడీ భూములను వేలం
అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలలో అన్యమత ప్రచారం పెరిగిందని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. మాన్సస్ ట్రస్ట్ని ఎలా కబ్జా చేశారో చూశామన్నారు. టీటీడీ భూములను వేలం ద్వారా కబ్జా చేయడానికి.. సీఎం జగన్ అనుచరులు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాలను టార్గెట్ చేశారని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గత బోర్డులపై నిందలు వేయడం టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి తగదని పట్టాభి సూచించారు.
Updated Date - 2020-05-26T01:31:38+05:30 IST