ఏపీలో ఈ పరిస్థితికి సీఎం జగనే కారణం: శైలజానాథ్
ABN, First Publish Date - 2020-09-23T20:20:33+05:30
ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటానికి చేతకాని సీఎం జగన్మోహన్ రెడ్డే కారణమని..
అమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటానికి చేతకాని సీఎం జగన్మోహన్ రెడ్డే కారణమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ప్యాకేజీ పార్టీలని విమర్శించారు. మూడు రాజధానులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు.
అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురానికి, అనంతపురానికి అమరావతి సమాన దూరంలో ఉంటోందన్నారు. రాజధాని అమరావతిపై మాజీ సీఎం చంద్రబాబు తన సొంత వ్యవహారంలా వ్యవహరించారని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల పక్షాన పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. కరోనా వైరస్ నియంత్రణలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ఏపీలోని అనేక సమస్యలపై కాంగ్రెస్ సమన్వయ కమిటీలో చర్చించామన్నారు. ఏపీలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామని శైలజానాథ్ అన్నారు.
Updated Date - 2020-09-23T20:20:33+05:30 IST