ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేల కోట్లు ఖర్చుచేయలేం

ABN, First Publish Date - 2020-06-02T09:02:28+05:30

రాజధాని అమరావతిలో అర్ధాంతరంగా ఆపేసిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సవరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి ప్రాజెక్టులపై సమీక్ష


అమరావతి, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో అర్ధాంతరంగా ఆపేసిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సవరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. సోమవారమిక్కడ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్‌డీఏపై ఆయన సమీక్ష నిర్వహించారు. సదరు ప్రాజెక్టుల పనులను పునఃప్రారంభించి పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు ఈ సందర్భంగా ప్రతిపాదనలు సమర్పించారు.


వాటిని సీఎం పరిశీలించారని.. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వేల కోట్ల రూపాయలను ఈ ప్రాజెక్టులపై ఖర్చుచేయలేమని వ్యాఖ్యానించారని తెలిసింది. అందువల్ల ఆయా ప్రాజెక్టుల్లో ముఖ్యమైన, ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన వాటిని.. అదీ సాధ్యమైనంత తక్కువ వ్యయంతో పూర్తయ్యేలా ప్రతిపాదనలను రూపొందించాలని సూచించినట్లు  సమాచారం. ఈ భేటీలో పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ పి.లక్ష్మీనరసింహం, ప్రత్యేక కమిషనర్‌ వి.రామమనోహరరావు, సీఈ జక్రయ్య తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-02T09:02:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising