ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయం కోసం ఎన్టీఆర్‌ విగ్రహం తొలగింపు

ABN, First Publish Date - 2020-07-11T08:30:46+05:30

గ్రామ సచివాలయ భవనం నిర్మాణం కోసం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తొలగించడంతో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం నగరం గ్రామంలో ఉద్రిక్తత చోటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జగ్గంపేట మండలం నగరంలో ఉద్రిక్తత

జగ్గంపేట/జగ్గంపేటరూరల్‌, జూలై 10: గ్రామ సచివాలయ భవనం నిర్మాణం కోసం ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తొలగించడంతో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం నగరం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పంచాయతీ తీర్మానంతో ఏర్పాటుచేసిన విగ్రహా న్ని గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం తొలగించారు. నిర్మాణంలో ఉన్న ఓ కమ్యూనిటీ భవనంలో ఆ విగ్రహాన్ని పడేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. గ్రామంలో ఖాళీగా 27 సెంట్ల ప్రభుత్వ భూమి ఉందని అక్కడ కార్యాలయాలు నిర్మించుకోవచ్చని, అలా కాకుండా తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తొలగించి కార్యాలయాలు నిర్మించాలను కోవడం సరికాదన్నారు. వెంటనే ఆయన జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. విగ్రహం తొలగింపుపై పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే.. సీఐ వి.సురేష్‌బాబు, ఎంపీడీవో వెంకటలక్ష్మి భవన నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఆ పక్కనే  విగ్రహ ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది.

Updated Date - 2020-07-11T08:30:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising