అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి విచారం
ABN, First Publish Date - 2020-08-09T17:44:35+05:30
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.
విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలన్నారు. స్వర్ణా ప్యాలస్ హోటల్ను లీజుకు తీసుకుని కోవిడ్ కేర్ సెంటర్గా వాడుతున్నారు. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా...మరికొందరు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆక్కడ 30 మంది కోవిడ్ రోగులు, 10 మంది ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2020-08-09T17:44:35+05:30 IST