పాలిటెక్నిక్ విద్యార్థులను పాస్ చేయండి: రామకృష్ణ
ABN, First Publish Date - 2020-08-13T17:05:54+05:30
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా విపత్తు దృష్ట్యా మూడు సబ్జెక్టుల వరకు పెండింగ్ ఉన్న పాలిటెక్నిక్ విద్యార్థులను పాస్ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు సబ్జెక్టుల బ్యాక్ లాగ్ ఉన్న విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి, డిప్లమా సర్టిఫికేట్ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. మన ఏపీలో 3 సబ్జెక్టులు పెండింగ్లో ఉన్న విద్యార్థులు దాదాపు 17 వేల మంది ఉన్నారన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి డిప్లమో సర్టిఫికెట్లు అందజేయాలని రామకృష్ణ కోరారు.
Updated Date - 2020-08-13T17:05:54+05:30 IST