కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయండి: రామకృష్ణ
ABN, First Publish Date - 2020-09-25T14:52:31+05:30
అమరావతి: సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను..
అమరావతి: సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లను.. రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. 6 నెలలుగా వీరికి వేతనాలు లేక లెక్చరర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులలో సాంకేతిక లోపం కారణంగా... గత సంవత్సరంలో వీరికి 10 నెలల వేతనమే విడుదలైందని రామకృష్ణ తెలిపారు.
Updated Date - 2020-09-25T14:52:31+05:30 IST