తూర్పుగోదావరి విలీన మండలాలలో కుండపోతగా వర్షం
ABN, First Publish Date - 2020-08-20T15:44:01+05:30
తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాలలో కుండపోతగా వర్షం కురుస్తోంది.
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలోని విలీన మండలాలలో కుండపోతగా వర్షం కురుస్తోంది. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. శబరి, గోదావరి నదులలో వరద తగ్గినా ఎగువన కురుస్తున్న వర్షాలతో మరలా వరద పెరిగే ప్రమాదం ఉంది. భారీ వర్షాల కారణంగా వరద సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. విద్యుత్ లేకపోవడంతో గిరిజన గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి.
Updated Date - 2020-08-20T15:44:01+05:30 IST