ధవళేశ్వరం వద్ద 15.50 అడుగులకు తగ్గిన నీటి మట్టం
ABN, First Publish Date - 2020-08-20T13:58:54+05:30
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది.
రాజమండ్రి: ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ నీటి మట్టం 15.50 అడుగులకు తగ్గింది. అధికారులు 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 15.60 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
Updated Date - 2020-08-20T13:58:54+05:30 IST