ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పెరుగుతున్న గోదావరి వరద ప్రవాహం
ABN, First Publish Date - 2020-08-14T15:00:21+05:30
ఎడతెరపలి లేకుండా కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది.
రాజమండ్రి: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ నీటి మట్టం 9.30 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేసి... 7.10 లక్షలు క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు ఉభయగోదావరి జిల్లాలకు 10,500 క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు.
Updated Date - 2020-08-14T15:00:21+05:30 IST