మనసున్న మారాజు రాజశేఖరరెడ్డి: రఘురామ కృష్ణరాజు
ABN, First Publish Date - 2020-07-08T15:56:01+05:30
ఏలూరు: వైఎస్సార్ జయంతి సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఏలూరు: వైఎస్సార్ జయంతి సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఒక ప్రకటనను విడుదల చేశారు. మనసున్న మారాజు వైఎస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు. ఆయన చేసిన పాదయాత్ర వలన మనోరంజకంగా పరిపాలన చేయగలిగారన్నారు.
ఆయన చేపట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయన్నారు. జలయజ్ఞంతో వృథా జలాల వినియోగానికి శ్రీకారం చుట్టారన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేశారన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులతో నిత్యం మమేకమై, అందరికీ నేనున్నాననే భరోసా కల్పించారని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
Updated Date - 2020-07-08T15:56:01+05:30 IST