రాంమాధవ్ వ్యాఖ్యలపై స్పందించిన రఘురామ
ABN, First Publish Date - 2020-08-11T20:23:58+05:30
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి రెండు ప్రాంతాల ప్రజల మనసులను..
న్యూఢిల్లీ: వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి రెండు ప్రాంతాల ప్రజల మనసులను గాయపరచాల్సిన అవసరం ఏంటని ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రజస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉందని, ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా? అని అన్నారన్నారు.
80 మంది ఎంపీలున్న యూపీ రాష్ట్రంలో ఒకే ఒక రాజధాని ఉన్నప్పుడు ఏపీకి మూడు రాజధానులు ఎందుకని రాం మాధవ్ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని రఘురామ వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు.
Updated Date - 2020-08-11T20:23:58+05:30 IST