ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఉద్యమానికి వంగవీటి రాధా సంఘీభావం

ABN, First Publish Date - 2020-08-05T18:40:44+05:30

ఏపీ రాజధాని రైతుల ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ రాజధాని రైతుల ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా సంఘీభావం తెలిపారు. తర్వాత అక్కడి నుంచి పాదయాత్రంగా వెళ్లి తుళ్లూరు గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాధా పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం  మాట్లాడుతూ రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో 'స్టేటస్కో' ఇవ్వటం ద్వారా తాత్కాలిక ఊరట కలిగిందన్నారు. రాజధాని ఉద్యమ పోరాటంలో రైతులకు అంతిమ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.


232 రోజులుగా రైతులు దీక్షలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం బాధాకరమని వంగవీటి రాధా అన్నారు. రైతుల న్యాయమైన పోరాట పటిమకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానన్నారు. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, చివరి క్షణాల వరకు న్యాయపరంగా, శాంతియుతంగా పోరాటం కొనసాగించాలని వంగవీటి రాధా సూచించారు.

Updated Date - 2020-08-05T18:40:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising