ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళం జిల్లా: క్వారంటైన్ కేంద్రంలో దెయ్యం కలకలం

ABN, First Publish Date - 2020-05-18T18:00:59+05:30

సంతబొమ్మాళి క్వారంటైన్ కేంద్రంలో దెయ్యం కలకలం రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా: సంతబొమ్మాళి క్వారంటైన్ కేంద్రంలో దెయ్యం కలకలం రేగింది. ఉన్నత పాఠశాలలో విశాఖ, గుంటూరు, నెల్లూరు నుంచి వచ్చిన 45 మంది వలస కార్మికులను క్వారంటైన్‌లో ఉంచారు. అయితే ఈ పునరావాస కేంద్రంలో ఉంటున్న ఓ వ్యక్తి దెయ్యం పట్టినట్లుగా నానా హంగామా చేశాడు. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారంతా భయంతో క్వారంటైన్ కేంద్రం నుంచి బయటకు పరుగులు తీశారు.


కొందరు ధైర్యం చేసి ఆ వ్యక్తిని తీసుకుని సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్లి పూజలు చేశారు. అప్పటికీ ఆ వ్యక్తిలో మార్పు రాకపోవడంతో జుట్టుపట్టుకుని చీపురుతో చితక్కొట్టారు. దీంతో ఆ వ్యక్తి దెయ్యం వదిలినట్టు కిందపడిపోయాడు. పోలీసులు, అధికారులు క్వారంటైన్ కేంద్రానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. ఇంటికి వెళ్లేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారంటూ అధికారులు కొట్టిపారేశారు.

Updated Date - 2020-05-18T18:00:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising