ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతపై వైసీపీ నాయకుల దాడి

ABN, First Publish Date - 2020-06-06T09:42:28+05:30

కనిగిరి మండల పరిఽధిలోని వాగుపల్లి సచివాలయం వద్ద శుక్రవారం టీడీపీ నేత, మా జీ సర్పంచ్‌ భార్యపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి టౌన్‌, జూన్‌ 5 : కనిగిరి మండల పరిఽధిలోని వాగుపల్లి సచివాలయం వద్ద శుక్రవారం టీడీపీ నేత, మా జీ సర్పంచ్‌ భార్యపై వైసీపీ నాయకులు దాడి చేశారు. వాగుపల్లి మాజీ సర్పంచ్‌ భార్య ఎస్తేరమ్మకు భర్త చనిపోవడంతో వితంతు పింఛన్‌ నమోదు కోసం తన మరిది, మాజీ ఉప సర్పంచ్‌ దానియేలుతో వాగుపల్లి సచివాలయం వద్దకు వెళ్లారు.


అక్కడ వారు వితంతు పింఛన్‌ కోసం నమోదు చేసుకుంటుండగా వైసీపీ నాయకులు మూకుమ్మడిగా కులం పేరుతో దూషిస్తూ మీ పెత్తనం ఇక్కడేందంటూ మూలే గోవిందరెడ్డి, మూలే వెంకటేశ్వరరెడ్డి, మూలే శివారెడ్డి, వీరం రెడ్డి సురే్‌షబాబు, బాలకృష్ణ, మేడం శ్రీనివాసులరెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు తమపైదాడి చేశారని బాధితులు తెలిపారు. గాయాలపాలైన కత్తి దానియేలు, కత్తి ఎస్తేరమ్మ కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-06-06T09:42:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising