బడ్డీ బంకులో చోరీ
ABN, First Publish Date - 2020-11-14T03:02:20+05:30
తాళ్లూరు నుంచి తూర్పుగంగవరం వెళ్లే మార్గంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న యన్నం హనుమారెడ్డి బడ్డీబంకులో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు.
తాళ్లూరు, నవంబరు 13: తాళ్లూరు నుంచి తూర్పుగంగవరం వెళ్లే మార్గంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న యన్నం హనుమారెడ్డి బడ్డీబంకులో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 5వేల విలువైన సామాగ్రిని అపహరించుకు వెళ్లారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బంకుకు తాళాలు వేసే కొక్కాలను తొలగించి లోనికి ప్రవేశించి కూలింగ్ మంచినీటి క్యాన్లు, సిగరెట్లు కుర్చి , చిల్లరను తీసుకెళ్లారు.
Updated Date - 2020-11-14T03:02:20+05:30 IST