ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లభ్యమైన ఇద్దరు యువకుల మృతదేహాలు

ABN, First Publish Date - 2020-10-20T07:59:06+05:30

గుంటూరు జిల్లా బాపట్ల పాం డురంగాపురం బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఈతకు దిగి గల్లంతైన మార్టూరులోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఇద్దరు యువకులైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్టూరు, అక్టోబరు 19 : గుంటూరు జిల్లా బాపట్ల పాం డురంగాపురం బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఈతకు దిగి గల్లంతైన మార్టూరులోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఇద్దరు యువకులైన గల్లా రా జేష్‌, అట్లూరి మోజెస్‌ మృతదేహాలు సోమవారం సాయం త్రం లభ్యమయ్యాయి. వారి మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు.


23 గంటల తర్వాత కనిపించిన మృతదేహాలు

ఆదివారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలను సోమవారం మఽధ్యాహ్నం దాదాపు 3 గంటల 30 నిమిషాల సమయంలో సముద్రంలో పోలీసులు, గజఈతగాళ్లు కనుగొన్నారు. మార్టూరులోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన 13 మంది యువకులు పాండురంగపురం బీచ్‌లో ఈతకు దిగిన విషయం తెలిసిందే. వారిలో  గల్లంతైన యువకుల మృతదేహాల కోసం గాలిస్తున్న పోలీసులకు దాదాపు 23 గంటల తర్వాత సముద్రంలో కనిపించాయి.


పాండురంగపురం బీచ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కనిపించిన మృతదేహాలను గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు బయటకు తీసుకువచ్చారు. విషయం తెలియగానే 50 మందికి పైగా బాపట్ల వెళ్లి యువకుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. బాపట్ల ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం చేసి సోమవారం రాత్రి అప్పగించారు.


Updated Date - 2020-10-20T07:59:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising