మినుము కోత మిషన్ బోల్తా.. మహిలా కూలీలకు గాయాలు
ABN, First Publish Date - 2020-11-30T01:40:20+05:30
మార్టూరు మండల పరిధిలోని బొల్లాపల్లి టోల్గేట్ సమీపంలో మినుము కోతకు ట్రాక్టరుపై వెళుతున్న కూలీలు నలుగురు గాయపడ్డారు.
మార్టూరు, నవంబరు 29 : మండల పరిధిలోని బొల్లాపల్లి టోల్గేట్ సమీపంలో మినుము కోతకు ట్రాక్టరుపై వెళుతున్న కూలీలు నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. తాటివారిపాలేనికి చెందిన 10 మంది కూలీలు మినుము కోతకు ట్రాక్టరు ఇంజను కు వెనుకవైపు నూర్పిడి యంత్రంపై కూర్చున్నారు. జాతీయరహదారి నుంచి పొలానికి మట్టిరోడ్డుపై వెళుతుండగా ట్రాక్టరు బురద కారణంగా పక్కకు జారడంతో, నూర్పిడి యంత్రం తిరగబడింది. దానిపై కూర్చున్న కూలీలలో కొంతమంది పురుషులు కిందకు దూకగా, మహిళా కూలీలు నలుగురు కొడవళ్లఈశ్వరమ్మ, గుంటి వెంకాయమ్మ, కొడవళ్ల రాజ్యలక్ష్మి, కొడవళ్ల ఈశ్వరమ్మలకు గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో నరసరావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
Updated Date - 2020-11-30T01:40:20+05:30 IST