ఆటో బోల్తాపడి.. వృద్ధుడి మృతి
ABN, First Publish Date - 2020-09-26T20:58:48+05:30
ఆటో బోల్తాపడి.. వృద్ధుడి మృతి
మద్దిపాడు: ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలైన ఘటన మండలంలోని దొడ్డవరంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే శివరాంపురానికి చెందిన దేవదాసు, ఎరజాని మరియమ్మ, పేరమ్మలతో పాటు మరో ఏడుగురు దేనువుకొండ పొలాల్లోకి మిరపనారు వేసేందుకు వెళ్లారు. పనులు ముగించుకుని అదే ఆటోలో శివరాంపురానికి బయలుదేరారు. మార్గంమధ్యలో దొడ్డవరం వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో దేవదాసు( 60), ఎరజాని మరియమ్మ, పేరమ్మలకు తీవ్రగాయాలు కాగా 108లో రిమ్స్కు తరిలించారు. చికిత్స పొందుతూ దేవదాసు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మద్దిపాడు ఎస్సై ఫిరోజ్పాతిమా ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-09-26T20:58:48+05:30 IST