ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు ఇంటికే పౌష్టికాహారం అందజేయాలి

ABN, First Publish Date - 2020-03-24T10:51:38+05:30

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులుగా ఉన్న వారికి ఏడు రోజులకు సరిపడా పౌష్టికాహారాన్ని ఒకేసారి అందజేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు నగరం, మార్చి 23 : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులుగా ఉన్న వారికి ఏడు రోజులకు సరిపడా పౌష్టికాహారాన్ని ఒకేసారి అందజేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు కేంద్రాలు మూసివేసి ఉన్నందున వెంటనే వారికి అందాల్సిన అన్ని పౌష్టికాహార వస్తువులు వారి ఇళ్లకే వెళ్లి అందజేయాలని కోరారు. లబ్ధిదారులందరికీ వీటిని ఇళ్లకు అందజేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.


బాలసంజీవని, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద అందించాల్సిన పౌష్టికాహారాన్ని అందజేయాలని కోరారు. టేక్‌ హోం రేషన్‌ను ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. కార్యకర్తల పోస్టులు ఖాళీగా ఉంటే సూపర్‌వైజర్‌, సీడీపీవో పంపిణీ చేయాలని చెప్పింది. చౌకధరల దుకాణం నుంచి ఈ రేషన్‌ సరుకులను సకాలంలో తీసుకుని లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 

Updated Date - 2020-03-24T10:51:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising