మూడు రాజధానులపై ఎన్నికలకు సిద్ధం కావాలి
ABN, First Publish Date - 2020-08-07T11:27:01+05:30
ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేసి, మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాకోర్టులో ఎన్నికలకు సిద్ధం కావాలని నియోజకవర్గ టీడీపీ ..
టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి యడం బాలాజీ
చీరాల, ఆగస్టు 6 : ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేసి, మూడు రాజధానుల నిర్ణయంపై ప్రజాకోర్టులో ఎన్నికలకు సిద్ధం కావాలని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి యడం బాలాజీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఎన్నికలకు ముందు అమరావతే రాజధాని అని చెప్పి, ఇప్పుడు మాటతప్పి, మడం తిప్పిన సీఎం జగన్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
రాజధాని అమరావతి మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ను స్వీకరించలేక తన చేతగానితనాన్ని సీఎం జగన్ బహిర్గతం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులతో రాష్ట్రం అథోగతి పాలవుతుందన్నారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా త న పంథా మార్చుకోవడంలేదని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన సీఎం, ఉద్యోగులకు జీతాలూ ఇవ్వలేని స్థితికి తీసుకొస్తున్నారన్నారు. రాజధాని సమస్య కేవలం 29వేల మంది రైతులది మాత్రమే కాదని, 5 కోట్ల ఆంధ్రులదని బాలాజీ పేర్కొన్నారు.
Updated Date - 2020-08-07T11:27:01+05:30 IST