ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల బదిలీల్లో కదిలిక

ABN, First Publish Date - 2020-09-12T10:18:09+05:30

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో కదలిక వచ్చింది. టీచర్ల పునర్విభజన ప్రక్రియను వెంటనే పూ ర్తిచేయాలని పాఠశాల విద్య కమిషనర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

18నాటికి రేషనలైజేషన్‌ జాబితాలు

ఆదేశించిన విద్యాశాఖ కమిషనర్‌ 

త్వరలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం


ఒంగోలువిద్య, సెప్టెంబరు 11 : ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో కదలిక వచ్చింది. టీచర్ల పునర్విభజన ప్రక్రియను వెంటనే పూ ర్తిచేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ జాబితాలు తయారీకి జిల్లాల వారీ అధికారులను నియమించారు. జిల్లా, మండల పరిషత్‌, ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను పునర్విభజన చేస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 29నాటికి పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల వివరాలు, యూడైస్‌ ఆధారంగా కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎంతమంది పిల్లలకు, ఎంతమంది టీచర్లను కేటాయించాలో కూడా ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. పాఠశాలలున్న ప్రాంతాలు, అక్కడ ఉపాధ్యాయులు పొందే హెచ్‌ఆర్‌ఏ ప్రాతిపదికగా కేటగిరీ 1, 2, 3, 4 వారీగా జాబితాలను సిద్ధం చేయనున్నారు. ఆగస్టు 31నా టికి ఒక పాఠశాలలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారు బదిలీకి అర్హులు. అలాగే ఐదేళ్లు పూర్తిచేసిన హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తిచేసిన ఎస్జీటీలు, స్కూలు అసిస్టెంట్లు, ఇతర కేటగిరీ టీచర్లందరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే.


16లోపు కమిషనర్‌కు అందజేయాలి

ఉపాధ్యాయుల పునర్విభజన జాబితాలు అన్నింటిని ఈ నెల 18నాటికి పూర్తిచేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ షెడ్యూల్‌ ప్రకటించారు. జిల్లాలో తయారుచేసిన జాబితాలను పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయంలోని యూడైస్‌ డేటాతో సరిపోల్చి ధ్రువీకరణ పొందాల్సి ఉంది. జాబితాల తయారీ అధికారం పూర్తిగా జిల్లాలకే అప్పగిస్తే తప్పులు దొర్లే అవకాశం ఉన్నందున దానికి చెక్‌పెడుతూ కమిషనర్‌ కార్యాలయంలో జాబితాలను ధ్రువీకరించుకోవాలని ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన జిల్లా జాబితాలను పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.  ఆయా తేదీల్లో కేటాయించిన జిల్లాల అధికారులు ఉదయం 10.30 కల్లా కమిషనర్‌ కార్యాలయంలోని ఐటీ సెల్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత వారు 18వ తేదీన ధ్రువీకరిస్తారు.

Updated Date - 2020-09-12T10:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising