ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విధుల్లో ఉన్న ఎస్సైపై దురుసు ప్రవర్తన

ABN, First Publish Date - 2020-03-24T10:58:49+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధించేందుకు సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలుక్రైం, మార్చి 23 : కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధించేందుకు సోమవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా నగరంలో వాహనదారులు తిరగకుండా కట్టడి చేసేందుకు ఒన్‌టౌన్‌ ఎస్సై ఫాతిమా స్థానిక చర్చి సెంటర్‌లో వాహనదారులను నిలిపి రేపటి నుంచి బయట తిరగవద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఆ సమయంలో ఓ కారును నిలిపి అవగాహన కల్పిస్తుండగా కారులో ఉన్న వృద్ధుడు మహిళా ఎస్సైపై దరుసుగా మాట్లాడాడు.


ఇదే సందర్భంలో ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌ అక్కడికి చేరి ఆ వృద్ధుడ్ని గట్టిగా ప్రశ్నించాడు. అప్పటికీ ఆయన వెనక్కు తగ్గకుండా అదేవిధంగా డీఎస్పీతోననూ మాట్లాడారు. దీంతో ఆ వృద్ఢుడ్ని అదుపులోకి తీసుకోని కారును స్వాధీనం చేసుకొని ఒన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఆయన నగరంలో ఓ విద్యాసంస్థ నిర్వహించే జయరామయ్యగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై రాత్రి పొద్దుపోయేంత వరకు ఒన్‌టౌన్‌ పోలీసుస్టేన్‌లో పంచాయితీ నడిచింది.

Updated Date - 2020-03-24T10:58:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising