అందరికీ సంక్షేమ ఫలాలు: మంత్రి బాలినేని
ABN, First Publish Date - 2020-06-05T10:21:46+05:30
పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాల లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని విద్యుత్, అటవీ, పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు.
ఒంగోలు(కలెక్టరేట్), జూన్ 4 : పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాల లబ్ధి చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందని విద్యుత్, అటవీ, పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వాహన మిత్ర పథకం కింద రెండో విడత నగదు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కలెక్టరేట్లోని స్పందన భవన్లో విద్యాశాఖ మం త్రి ఆదిమూలపు సురే్షతో కలిసి బాలినేని ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ లాక్డౌన్లో ఆటోలు తిరగక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి అక్టోబరు నెలలో ఇవ్వాల్సిన ఆర్థిక సహాయం రూ. 10వేలు ముందుగా పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి సీఎం అనేక పథకాలను అమలు చేస్తూ ప్రజలకు విశ్వసనీయత, భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. కలెక్టర్ పోలా భాస్కర్, శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, టీజేఆర్ సుధాకర్బాబు, అన్నా రాం బాబు, జేసీ టీఎస్ చేతన్, డీటీసీ డాక్టర్ బీ కృష్ణవేణి, ఎంవీఐ జయప్రకాష్ పాల్గొన్నారు.
Updated Date - 2020-06-05T10:21:46+05:30 IST