జగనన్న విద్యాకానుక మార్గదర్శకాలు జారీ
ABN, First Publish Date - 2020-07-17T11:18:22+05:30
ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరంలో సమగ్రశిక్ష ఆధ్వ ర్యంలో..
ఒంగోలువిద్య, జూలై 16 : ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరంలో సమగ్రశిక్ష ఆధ్వ ర్యంలో అందజేయనున్న జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి రాష్ట్ర ప్రాజె క్టు డైరెక్టర్ గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. విద్యాకానుకలో భాగం గా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం, నోటుపుస్తకాలు, పాఠ్యపుస్త కాలు ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగులను కిట్రూ పంలో అందజేస్తారు. రాష్ట్రస్థాయిలో కొనుగోలు చేసిన ఈ వస్తువులు సరఫ రాదారులు నేరుగా మండల రిసోర్సు కార్యాలయాలకు అందజేస్తారు. బూట ్లకు సంబంధించి ట్రాక్మీద సైజులు, బాలికలకు సంబంధించినవైతే జి అని బాలురకు బి అని ముద్రించి ఉంటుంది. యూనిఫాంకు సంబంధించిన ప్యా క్ కవర్పై బాలికలకు జి అని, బాలురకు బి అని ముద్రించి ఉంటుందన్నా రు. తరగతుల బట్టి మూడు సైజుల బ్యాగులను అందిస్తారన్నారు.
Updated Date - 2020-07-17T11:18:22+05:30 IST