ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం జిల్లాలో.. 171 మంది ఎస్‌జీటీలకు నియామక ఉత్తర్వులు

ABN, First Publish Date - 2020-09-27T17:47:17+05:30

జిల్లాలో డీఎస్సీ-2018లో సెకండరీ గ్రేడ్‌ పోస్టులకు ఎంపికైన 171 మందికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌన్సెలింగ్‌ నిర్వహించి అందజేసిన జేసీ-2, డీఈవో


ఒంగోలు: జిల్లాలో డీఎస్సీ-2018లో సెకండరీ గ్రేడ్‌ పోస్టులకు ఎంపికైన 171 మందికి శనివారం నియామకపు ఉత్తర్వులను జారీ చేశారు. జాయింట్‌ కలెక్టర్‌-2 టీఎస్‌ చేతన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని ఎన్టీఆర్‌ కళాపరిషత్‌లో వారి కి తొలుత కౌన్సెలింగ్‌ నిర్వహించా రు. 185 పోస్టుల భర్తీకి అభ్యర్థుల ను ఎంపిక చేశారు. దివ్యాంగులు, స్పోర్ట్స్‌ కోటాలో ఎంపికైన 11 మం ది అభ్యర్థుల సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తి కాలేదు. మిగిలిన 174 మందిలో ముగ్గురు గైర్హాజరయ్యారు. ఒకరు మరణించగా మరో అభ్యర్థి ఇంకో ఉద్యోగం వచ్చి వెళ్లిపోయారు.


వర్షం కారణంగా  కౌన్సెలింగ్‌కు హాజరు కాలేకపోయానని, ఆదివారం వచ్చి నియామక ఉత్తర్వులు తీసుకుంటానని ఒకరు కోరడంతో అందుకు అధికారులు అంగీకరించారు. మిగిలిన 171 మం దికి జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌, డీఈవో సుబ్బారావు నియామకపు ఉత్తర్వులను అందజేశారు. జడ్పీ సీఈవో కైలాష్‌ గిరీశ్వర్‌, ఉపవిద్యాధికారులు, ఎం. వెంకటేశ్వర్లు, సందానీబాషా పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T17:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising