ఉపాధి పనుల్లో లోపాల గుర్తింపు : ఏపీడీ
ABN, First Publish Date - 2020-12-12T05:12:55+05:30
పలు గ్రామాల్లో ఉపాధి హమీ పనుల్లో జరి గిన లోపాలను గుర్తించినట్లు అడిషినల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి చె ప్పారు.
ప్రజలు లేకుండానే ముగిసిన ప్రజావేదిక
అద్దంకిటౌన్, డిసెంబరు 11 : పలు గ్రామాల్లో ఉపాధి హమీ పనుల్లో జరి గిన లోపాలను గుర్తించినట్లు అడిషినల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి చె ప్పారు. శుక్రవారం అద్దంకి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉపాధి హామీ పను లకు సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ మండలంలో 2018 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31వ తేదీ వరకు జరిగిన ఉపాధి పనులను సామాజిక తనిఖీ బృందం పరిశీలించిందని, మొత్తం రూ.13 కోట్లతో పనులు జరిగాయన్నారు. పలు గ్రామా ల్లో జరిగిన పనుల్లో తనిఖీ బృందం లోపాలను గుర్తించారని, ఎక్కువగా సెర్ప్ ద్వారా వేసిన మొక్కలు క్షేత్రస్థాయిలో లేకపోవడం, వాటికి నగదు చెల్లించారని చెప్పారు. పలు ప్రదేశాల్లో వర్కు బోర్డులు పెట్టక పోవడం, పంచాయతీరాజ్ నుంచి రికార్డులు ఇవ్వలేదన్నారు. ప్రజలు లేకపోయినప్పటికీ అధికారులే కార్యక్ర మాన్ని ముగించారు. ఎంపీడీవో రాజేందర్, ఏపీడీ సుబ్బారావు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-12T05:12:55+05:30 IST