డిగ్రీ పరీక్షా కేంద్రాలపై స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు
ABN, First Publish Date - 2020-12-06T05:43:30+05:30
ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డిగ్రీ 5, 6 సెమిస్టర్ సప్టిమెంటరీ పరీక్షల్లో శనివారం పట్టణ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగాయి.
ఆరుగురు విద్యార్థుల డీబార్
కనిగిరి, డిసెంబరు 5: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ డిగ్రీ 5, 6 సెమిస్టర్ సప్టిమెంటరీ పరీక్షల్లో శనివారం పట్టణ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగాయి. పరీక్షలు జరుగుతున్న తరుణంలో స్క్వాడ్ టీమ్ ఆకస్మి కంగా తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు మాస్కాపీయింగ్ చేస్తుం డగా గుర్తించి డీబార్ చేసినట్లు స్క్వాడ్ టీమ్ లీడర్ కోటేశ్వరరావు, టీమ్ సభ్యులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తెలిపారు.
Updated Date - 2020-12-06T05:43:30+05:30 IST