పాఠశాలల ఆడిట్ కేంద్రాల పెంపు : ఏపీసీ
ABN, First Publish Date - 2020-09-14T10:15:35+05:30
జిల్లాలో ప్ర భుత్వ రంగ పాఠశాలలకు 2019-20 సంవత్సర ంలో విడుదలైన నిధుల వినియోగంపై నిర్వ హిస్తున్న ఆడిట్కు ..
ఒంగోలువిద్య, సెప్టెంబరు 13 : జిల్లాలో ప్ర భుత్వ రంగ పాఠశాలలకు 2019-20 సంవత్సర ంలో విడుదలైన నిధుల వినియోగంపై నిర్వ హిస్తున్న ఆడిట్కు కేంద్రాలను పెంచినట్లు స మగ్రశిక్ష ఏపీసీ ఎం.శ్రీనివాసరెడ్డి ఆదివారం తెలిపారు. కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయ సం ఘాల విజ్ఞప్తి మేరకు ఆడిట్ కేంద్రాల పెంచిన ట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన షె డ్యూలును ఏపీసీ ప్రకటించారు. ఒంగోలులోని సెయింట్ జేవియర్స్ కేంద్రంలో ఒంగోలు అ ర్బన్, రూరల్, కొత్తపట్నం, సంతనూతలపాడు, కందుకూరు, కొండపి, మద్దిపాడు, తాళ్లూరు, ముండ్లమూరు, అద్దంకి, నాగులుప్పలపాడు, జె.పంగులూరు, కొరిశపాడు, జరుగుమల్లి మ ండలాలు హాజరుకావాలి. అలాగే మార్కాపు రం ఎంఆర్సీకి మార్కాపురం, కురిచేడు, కొన కనమిట్ల, దొనకొండ, అర్ధవీడు, బేస్తవారిపేట, కంభం, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, పె ద్దదోర్నాల, త్రిపురాంతకం, తర్లుపాడు, పెద్దా రవీడు మండలాలు వారు ఆడిట్ చేయించుకో వాలి.
గిద్దలూరు ఎంఆర్సీకి గిద్దలూరు, రాచర్ల, కొరవోలు మండలాలు, చీరాల ఎంఆర్సీలో చీ రాల, వేటపాలెం, కారంచేడు, చినగంజాం మ ండలాలు, కందుకూరు ఎంఆర్సీకి కందుకూ రు, సింగరాయకొండ, ఉలవపాడు, లింగసము ద్రం, పొన్నలూరు, గుడ్లూరు, వలేటివారిపాలెం మండలాలు, పొదిలి ఎంఆర్సీలో పొదిలి, దర్శి మర్రిపూడి మండలాలు, పర్చూరు ఎంఆర్సీలో పర్చూరు, యద్దనపూడి, ఇంకొల్లు, అలాగే మా ర్టూరు ఎంఆర్సీలో మార్టూరు, సంతమాగు లూరు, బల్లికురవ మండలాలు, కనిగిరి ఎంఆ ర్సీలో కనిగిరి, వెలిగండ్ల, పిసిపల్లి, పామూరు, హనుమంతునిపాడు, సిఎస్మండలాల ప్రధా నోపాధ్యాయులు హాజరుకావాలన్నారు.
Updated Date - 2020-09-14T10:15:35+05:30 IST