ఐసోలేషన్కు ప్రజాప్రతినిధి కుటుంబం
ABN, First Publish Date - 2020-03-29T09:34:21+05:30
గుంటూరు జిల్లాలో కలకలం రేపిన కరోనా పాజిటివ్ కేసులో భార్యాభర్తల పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు...
గుంటూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలో కలకలం రేపిన కరోనా పాజిటివ్ కేసులో భార్యాభర్తల పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు తెలిపారు. ఆ ‘ఒక్కడి’ కారణంగానే గుంటూరులో ఆందోళన నెలకొందని తెలిపారు. శనివారం ఆ ఒక్కడితో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధితో పాటు అతని కుటుంబీకులు మొత్తం 20 మందిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరి నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. ఆ ఒక్కడికి వైరస్ నేరుగా సోకనందున(విదేశాలకు వెళ్లనందున) దీని తీవ్రత అంతగా లేదని వైద్యులు అంచనా వేస్తున్నారు.
Updated Date - 2020-03-29T09:34:21+05:30 IST