పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: సీఎం జగన్
ABN, First Publish Date - 2020-10-25T04:24:34+05:30
పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది: సీఎం జగన్
అమరావతి: పోలవరం ప్రాజెక్ట్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన అంశాన్ని గత ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచిందని సీఎం జగన్ ఆరా తీశారు.
ప్రతి అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను జగన్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్ చెల్లింపులు అమలు చేసే సమయంలో ఉన్న.. ధరలను బట్టే ఉంటుందని అధికారులు తెలిపారు.
Updated Date - 2020-10-25T04:24:34+05:30 IST