60 దాటితే ‘చేయూత’ ఉండదు.. నేటి నుంచే పథకం
ABN, First Publish Date - 2020-08-12T09:15:00+05:30
బుధవారం నుంచి ప్రారంభం కానున్న వైఎ్సఆర్ చేయూత పథకంలో ఒకసారి లబ్ధిదారులుగా నమోదైన
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): బుధవారం నుంచి ప్రారంభం కానున్న వైఎ్సఆర్ చేయూత పథకంలో ఒకసారి లబ్ధిదారులుగా నమోదైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు 60 ఏళ్లు నిండిన వెంటనే ఆ పథకానికి అనర్హులవుతారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేసింది. ఆయా సామాజిక వర్గాల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రభుత్వం ఈ పథకంలో రూ.75 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మొత్తాన్ని ఏటా రూ.18750 వంతున నాలుగేళ్లపాటు అందిస్తారు. ఏటా ఆగస్టు 12వ తేదీ నాటికి 45 ఏళ్లు నిండిన లబ్ధిదారులకు అందించడంతో పాటు ఒకసారి లబ్ధిపొందిన మహిళలు 60 ఏళ్లు దాటితే వారికి చేయూత నిలిపేస్తారు.
Updated Date - 2020-08-12T09:15:00+05:30 IST