రాష్ట్ర వాటా ఇవ్వనందునే ప్రాజెక్టులు ఆలస్యం
ABN, First Publish Date - 2020-09-17T09:52:38+05:30
ఏపీ ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన నిధులను ఇవ్వని కారణంగానే ఆయా రైల్వే ప్రాజెక్టుల పనులు ...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం తన వాటా కింద ఇవ్వాల్సిన నిధులను ఇవ్వని కారణంగానే ఆయా రైల్వే ప్రాజెక్టుల పనులు ఆలస్యమవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్సభలో వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ఓ ప్రశ్నకు బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పలు ప్రాజెక్టులు సకాలంలో పూర్తికావడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,733 కోట్లు డిపాజిట్ చేయాలని సూచించారు.
Updated Date - 2020-09-17T09:52:38+05:30 IST