గుంటూరు: ఉచిత రేషన్ కోసం బారులు తీరిన ప్రజలు
ABN, First Publish Date - 2020-03-29T17:43:54+05:30
ఏపీలోని లాక్డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఉచిత బియ్యం అందజేస్తోంది.
గుంటూరు: ఏపీలోని లాక్డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం ఉచిత బియ్యం అందజేస్తోంది. దీంతో గుంటూరులోని రేషన్ షాపులో ఉచిత రేషన్ కోసం ప్రజలు బారులు తీరారు. డీలర్లు కనీస దూరం పాటించేలా మార్కింగ్ కూడా వేయలేదు. రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు గుంపులుగా ఉన్నారు. రేషన్ షాపుల దగ్గర పేదల పడిగాపులు అధికారులు పట్టించుకోవడంలేదు. ట్యాబ్లలో సాఫ్ట్వేర్ ఇంకా అప్డేట్ కాలేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు.
Updated Date - 2020-03-29T17:43:54+05:30 IST