అమర జవాన్ కు పవన్ నివాళి
ABN, First Publish Date - 2020-07-08T08:47:50+05:30
జమ్మూకశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల దాడిలో తెలంగాణ బిడ్డ సాలిగం శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల దాడిలో తెలంగాణ బిడ్డ సాలిగం శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం ఎంతో దురదృష్టకరమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అమర జవాన్ శ్రీనివా్సకు పవన్ నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతో్షబాబు కుటుంబాన్ని ఆదుకున్న రీతిలోనే శ్రీనివాస్ కుటుంబానికి కూడా అండగా నిలవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ను పవన్ కోరారు.
Updated Date - 2020-07-08T08:47:50+05:30 IST