ప్రజల పార్టీగా ఎదిగిన బీజేపీకి శుభాకాంక్షలు: పవన్
ABN, First Publish Date - 2020-04-07T10:40:23+05:30
‘‘భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఊపిరి పోసుకొంది. నేటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంది.
అమరావతి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): ‘‘భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఊపిరి పోసుకొంది. నేటికి 40 వసంతాలు పూర్తి చేసుకుంది. 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి జనసేన తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో దేశం నలువైపులా విస్తరించిన బీజేపీ ప్రజల పార్టీగా అవిర్భవించింది. వ్యవస్థాపక నేతల ఆశలను, ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు శుభాభినందనలు’’అనిపవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Updated Date - 2020-04-07T10:40:23+05:30 IST