ఆలయాల్లో ‘ఆన్లైన్ పూజలు’
ABN, First Publish Date - 2020-05-19T11:58:01+05:30
ఆలయాల్లో ‘ఆన్లైన్ పూజలు’
అమరావతి(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లోనూ దర్శనాల నిలిపివేతను కొనసాగిస్తున్నట్టు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే, భక్తుల కోరిక మేరకు వారి గోత్రనామాలపై ఆన్లైన్ విధానంలో ప్రత్యేక పూజలు(పరోక్ష విధానంలో) చేయించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.
Updated Date - 2020-05-19T11:58:01+05:30 IST